Saturday, 9 March 2013
ఆలస్యం అంత విషమా?
ఎగ్జామ్ మొదలైన 15 నిమిషాల తర్వాత వస్తే అనుమతించం...
పరీక్ష హాల్లోకి నిమిషం ఆలస్యంగా వచ్చినా వాపస్ వెళ్ళాల్సిందే.
సమయం ముంచుకొస్తుండటంతో పరుగెత్తుతున్న విద్యార్థులు...
సమయానికి చేరుకోలేక పోయానని దిగులుతో ఏడుస్తున్న విద్యార్థిని...
అనుమతించాలంటూ ప్రిన్సిపాల్ ను వేడుకొంటున్న విద్యార్థులు....
పరీక్షల వేళయిందంటే చాలు ఇలాంటి ప్రకటనలు... వార్తలు... తరచూ కనిపిస్తుంటాయి.
అదే సమయంలో
చీకట్లో పరీక్ష రాస్తున్న విద్యార్థులు...
క్యాండిల్ వెలుతురులో పరీక్ష రాస్తున్న విద్యార్థులు...
బెంచీలు లేక వరండాలో కింద కూర్చొని పరీక్ష రాస్తున్న విద్యార్థులు....
ఇవీ కనిపిస్తాయి పత్రికల్లో....
ఇవి కనిపించినప్పుడల్లా ఒక ప్రశ్న తొలుస్తుంటుంది....
కనీస సౌకర్యాలు కల్పించలేని వాళ్ళు....
విద్యార్థులకు మాత్రం కచ్చితంగా ఒక నిమిషం, 15 నిమిషాలంటూ ఎందుకు క్రమశిక్షణ విధించాలని
చూస్తారు?
అసలు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వస్తే వచ్చే నష్టం ఎవరికి?
విద్యార్థులకా? ప్రభుత్వానికా?
పరీక్ష కేంద్రాలకు చేరుకోవటానికి సరైన రవాణా సదుపాయాలుండవు...
చేరుకున్నాక... కూడా సదుపాయాలు సమకూర్చలేరు. పరీక్ష పేపర్లు కూడా తప్పులులేకుండా
తయారు చేయలేరు... కానీ... అదేంటో... విద్యార్థులను మాత్రం పరుగులెత్తిస్తారు. టెన్షన్
పెడతారు.. ఏడిపిస్తారు....
ట్రాఫిక్ జామో... అనుకోని అవాంతరమో ... కారణం ఏదైనా కావొచ్చు... ఆలస్యం కావటానికి!
ఒక్క నిమిషం ఆలస్యమైందని ఏడాది చదువును నాశనం చేయటం ఏం న్యాయం?
ఆలస్యమైతే నష్టపోయేది విద్యార్థే. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయటానికి సమయం సరిపోక
ఇబ్బంది పడేది విద్యార్థేగాని నిర్వాహకులు కాదే!
కావాలంటే పరీక్ష పూర్తయ్యే దాకా హాల్ లోంచి బయటకు వెళ్ళనీయమని నిబంధన పెట్టడాన్ని
కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ నిమిషం దాటితే రానివ్వకపోవటంలో కారణం మాత్రం
విచిత్రం.
క్రమశిక్షణ పాటించటం బాగానే ఉంటుంది. కానీ అది జీవితాన్ని నిలబెట్టడానికి సాయపడాలే తప్ప కూల్చటానికి కాదు.
Subscribe to:
Post Comments (Atom)
పరీక్షలు జరిగేరోజున మనం ఇళ్ళలో కూర్చుంటే సరిపొద్ది కదా.
ReplyDeleteNo Traffic Jam
No Bus rush.